Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Sunday, June 19, 2005

కుమారసంభవం 1-2 యం సర్వశైలాః పరికల్ప్య వత్సం

యం సర్వశైలాః పరికల్ప్య వత్సం
మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే
భాస్వన్తి రత్నాని మహౌషధీశ్చ
పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీమ్

(పురాణాల్లో ఒక చోట దీనికి సంబంధించిన కథ ఉంది. ఒకసారి భూదేవికి కోపం వచ్చి ప్రజలకు ధనధాన్యాలు ఇవ్వడం మానేస్తుంది. అది పృథుచక్రవర్తికి నచ్చక భూదేవిని చంపడానికి బయలుదేరుతాడు. భూదేవి గోవు రూపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది గానీ చివరికి చక్రవర్తికి చిక్కుతుంది. పృథువు అప్పుడు అన్ని జాతుల్లో శ్రేష్ఠమైన వారిని పాలవారిగా, దూడలుగా చేసి భూదేవినుంచి వారికి కావలసినవి తీసుకోమంటాడు.)

కథ కాంప్లికేటెడ్ గా ఉందిగానీ, శ్లోకం ప్రకారం పర్వతజాతిలో శ్రేష్ఠులు మేరువు, హిమవంతుడు అన్నమాట. పర్వతజాతికి సంబంధించిన ఓషధులు, రత్నాల్ని పృథువు చెప్పినట్లు మేరువుని పాలవాడిగా, హిమవంతుడిని దూడగా చేసి సంపాదించుకున్నారు.

మన పురాణాల్లో కనపడే ఈ మేరు పర్వతం నిజంగా భూమ్మీద ఎక్కడ ఉందో ఎవరికన్నా తెలిస్తే రాయండి.

0 Comments:

Post a Comment

<< Home